భారతదేశంలో నంబర్‌వన్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎదిగిన షావోమి తన దూకుడును కొనసాగిస్తోంది. బిగ్‌ స్ర్కీన్‌, బిగ్‌బ్యాటరీ, ఏఐ కెమెరాలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న షావోమి తాజాగా ఎంఐ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందించింది. బుధవారం రెడ్‌మి 8 లాంచింగ్‌ సందర్బంగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు షావోమి ఎండీ మను కుమార్‌ జైన్‌. అలాగే 64ఎంపీ  క్వాడ్‌ కెమెరా(4) లతో మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 16నే దీన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు.
ఐదేళ్లుగా కాలంగా కస్టమర్లు తమపై చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా రూ. 500 కోట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నట్టు షావోమి ఎండీ మనుకుమార్‌ జైన్‌ ప్రకటించారు. తొలి  50 లక్షల వినియోగదారులకు 4జీబీ వేరియంట్‌ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 లక్షల  రెడ్‌మి8 కొనుగోలుదారులకు రూ. 1000 విలువ (రూ. 5 కోట్లు) గల అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తుందన్నమాట.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ సీజన్‌లో కేవలం 7రోజుల్లో 5.3 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రకటించారు. అలాగే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ దీపావళి సేల్‌లో నిమిషానికి 525 డివైస్‌లు అమ్మినట్టు తెలిపారు. షావోమిపై వినియోగదారుల అసాధారణ ప్రేమ ఎప్పటికే ఇలాగే కొనసాగాలని మనుకుమార్‌ ఆశించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours